మాదక ద్రవ్యాల హబ్గా ఎపి రాష్ట్రం-ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
- March 23, 2024అమరావతి: ఆంధ్ర రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చేశారని, డ్రగ్స్ రవాణా, వాడకంలో ఎపి నంబర్ 1 అనే ముద్ర వేశారని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పై శనివారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ఎపిని ఉడ్తా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని, దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు ఏపిలోనే ఉంటున్నాయని పేర్కొన్నారు. 25వేల కేజీల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే .. తమ తప్పు లేదంటూ బిజెపి, వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థల మద్దతు లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరతాయని ఆమె ప్రశ్నించారు. ‘డ్రగ్స్ మాఫియాతో మీకు సంబంధం లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి సేఫ్ హెవెన్గా మారింది. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నా. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు