ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- March 29, 2024
దోహా: ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో జనన మరియు మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమయాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో నవజాత శిశువుల కోసం జనన ధృవీకరణ పత్రాల దరఖాస్తులు తాత్కాలికంగా వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నది. నవజాత శిశు జనన ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్గా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా స్వీకరించబడతాయని పేర్కొంది. అదే సమయంలో జనన ధృవీకరణ పత్రాలను ఉమెన్స్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని నవజాత శిశువు నమోదు కార్యాలయంలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సేకరించవచ్చు లేదా ఖతార్ పోస్ట్ ద్వారా డెలివరీ అవుతుంది. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మానవతా సేవల కార్యాలయంలో మరణ ధృవీకరణ పత్రం జారీ సేవలు అందించబడతాయని పేర్కొంది. ఈద్ సెలవుల సమయంలో జనన మరియు మరణ కమిటీ తాత్కాలికంగా దరఖాస్తులను స్వీకరించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!