ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్

- March 29, 2024 , by Maagulf
ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్

దోహా: ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో జనన మరియు మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమయాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో నవజాత శిశువుల కోసం జనన ధృవీకరణ పత్రాల దరఖాస్తులు తాత్కాలికంగా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నది. నవజాత శిశు జనన ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్‌గా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా స్వీకరించబడతాయని పేర్కొంది. అదే సమయంలో జనన ధృవీకరణ పత్రాలను ఉమెన్స్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని నవజాత శిశువు నమోదు కార్యాలయంలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సేకరించవచ్చు లేదా ఖతార్ పోస్ట్ ద్వారా డెలివరీ అవుతుంది. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మానవతా సేవల కార్యాలయంలో మరణ ధృవీకరణ పత్రం జారీ సేవలు అందించబడతాయని పేర్కొంది. ఈద్ సెలవుల సమయంలో జనన మరియు మరణ కమిటీ తాత్కాలికంగా దరఖాస్తులను స్వీకరించదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com