బీజేపీ మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పిన రాహుల్
- March 31, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మన దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తే దేశం అగ్ని గుండాన్ని తలపించేలా ఉంటుందని చెప్పారు.
ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం ప్రజల గొంతుకవంటిదని, అది లేనిరోజు దేశమూ ఉండదని చెప్పారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవాలని ముగ్గురు-నలుగురు ఆశ్రిత పెట్టుబడుదారులతో ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్నవి సామాన్య ఎన్నికలు కాదని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు సరిగ్గా ఆలోచించి ఓటువేయకపోతే మోదీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ గెలుస్తుందని చెప్పారు. అదే గనుక జరిగితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని ఓ బీజేపీ ఎంపీ కూడా అన్నారని చెప్పారు.
రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జమ్మూకశ్మీర్ ఎన్సీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఝార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







