బీజేపీ మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పిన రాహుల్
- March 31, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మన దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తే దేశం అగ్ని గుండాన్ని తలపించేలా ఉంటుందని చెప్పారు.
ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం ప్రజల గొంతుకవంటిదని, అది లేనిరోజు దేశమూ ఉండదని చెప్పారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవాలని ముగ్గురు-నలుగురు ఆశ్రిత పెట్టుబడుదారులతో ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్నవి సామాన్య ఎన్నికలు కాదని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు సరిగ్గా ఆలోచించి ఓటువేయకపోతే మోదీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ గెలుస్తుందని చెప్పారు. అదే గనుక జరిగితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని ఓ బీజేపీ ఎంపీ కూడా అన్నారని చెప్పారు.
రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జమ్మూకశ్మీర్ ఎన్సీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఝార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







