మలేషియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న 'వానవిల్లు' బృందం
- June 05, 2016
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్ దాస్ నిర్మాతగా ప్రతీక్ ప్రేమ్ కరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్రం ఇటీవలే మలేషియాలో షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు అయిన ప్రతీక్ ప్రేమ్ మాట్లాడుతూ..ఇదొక వెరైటీ ప్రేమకథ. టైటిల్కి తగ్గట్లుగానే ఈ మూవీ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఓ చక్కని ప్రేమకథ ఉంది. ఈ సినిమాకి కథతో పాటు స్క్రీన్ప్లే కూడా చాలా చక్కగా కుదిరింది. ప్రస్తుతం మలేషియాలో షెడ్యూల్ పూర్తయింది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయింది. జూలై మొదటి వారం నుండి కేరళలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
ఈ షెడ్యూల్లో చిన్న బిట్సాంగ్తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. జూలై చివరివారంలో మా సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్ స్వరపరిచిన ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.అని అన్నారు. ప్రతీక్ప్రేమ్కరణ్, శ్రావ్య, విశాఖ, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్ ఫణి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్, డైలాగ్స్: పవన్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ మేనేజర్: సుబ్బారావు, అసోసియేట్ డైరెక్టర్స్: సుభాష్, నరేష్, అసిస్టెంట్ డైరెక్టర్స్: జై, మూర్తి, కెమెరామెన్: ఎస్.డి. జాన్, నిర్మాత: లంకా కరుణాకర్ దాస్, స్క్రీన్ప్లే-ఎడిటింగ్-దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







