బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనమిలా..
- June 30, 2015
సాధారణంగా టీనేజ్ అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. టీనేజ్లో వచ్చే హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఈ మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. దీంతో అమ్మాయిలకు అందం సమస్యయే కాకుండా కొంతమందిలో మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంతే కాదు ఈ మొటిమలు తగ్గగానే తరువాత ఏర్పడే మచ్చలు చాలా కాలం ముఖంపై ఉండిపోయి ముఖాన్ని నల్లగా మార్చేస్తుంది. ఈ నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని బాదం గింజలను చిన్నచిన్న పలుకులుగా చేసి దానికి కొద్దిగా శెనగపించి చేర్చి స్క్రబ్లా చేసి ముఖానికి పటించి, ముని వేళ్లతో వలయాకారంగా రాయాలి. పసుపు ముఖ్యంగా ఈ నల్ల మచ్చలను పోగొట్టడంలో కీలకపాత్ర వహిస్తుంది. కొద్దిగా పసుపులో కొంచెం పుదీనా గుజ్జు కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు అయిన తరువాత మెత్తని క్లాత్తో తుడిచేస్తే ముఖంపై బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. పచ్చిపాలు ముఖానికి రాసి పది నిముషాలైనాక గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









