మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఉగాది వేడుకలు
- April 09, 2024
మంగళగిరి: మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఉగాది వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయని స్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు. జాతకరీత్యా ప్రజల సొంత గృహ కళ నెరవేర్చేశక్తి చంద్రబాబుకు ఉందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూటమి 128 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందన్నారు.
చంద్రబాబుకు ఈ ఏడాది ఎంతో కలిసొస్తుందని..ఆయనకు అధికార యోగం ఉంది. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతుంది. బ్రహ్మ – మోడీ, విష్ణువు – పవన్, ఈశ్వరుడు – చంద్రబాబు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారు. టీడీపీది వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారు’’ అని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..







