యూఏఈకి చైనా ఎగిరే కార్లు
- April 12, 2024యూఏఈ: ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ముఖ్యంగా చైనాలో తయారైన ఎగిరే కార్లు త్వరలో యూఏఈ కి వస్తాయని భావిస్తున్నారు. కొత్తగా నియమించబడిన చైనీస్ కాన్సుల్ జనరల్ బోకియాన్ తెలిపారు. యూఏఈకి వస్తున్న చైనా ప్రవాసులు మరియు వ్యాపారాల భారీ ప్రవాహం కూడా ఉందని బోకియాన్ తెలిపారు. ఇప్పుడు దుబాయ్లో 370,000 కంటే ఎక్కువ మంది చైనీయులు నివసిస్తున్నారని, 8,000 వ్యాపారాలు ఎమిరేట్లో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఆసియాను యూరప్ మరియు ఆఫ్రికాకు కలిపే వాణిజ్యం మరియు మౌలిక సదుపాయాల నెట్వర్క్ను స్థాపించే లక్ష్యంతో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని ఆమె తెలిపారు.
చైనాలో తయారైన ఫ్లయింగ్ ట్యాక్సీలు వార్తల్లో హల్ చల్ చేశాయి. 2022లో చైనీస్-నిర్మిత XPeng X2 Gitex గ్లోబల్ టెక్నాలజీ షో సందర్భంగా రెండు సీట్ల ఫ్లయింగ్ కారు మొదటి పబ్లిక్ టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి మరియు ఎనిమిది ప్రొపెల్లర్లను ఉపయోగించి భూమి నుండి నిలువుగా పైకి లేపడం ద్వారా గంటకు 130కిమీ వేగంతో చేరుకోవడానికి రూపొందించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!