యూఏఈకి చైనా ఎగిరే కార్లు
- April 12, 2024
యూఏఈ: ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ముఖ్యంగా చైనాలో తయారైన ఎగిరే కార్లు త్వరలో యూఏఈ కి వస్తాయని భావిస్తున్నారు. కొత్తగా నియమించబడిన చైనీస్ కాన్సుల్ జనరల్ బోకియాన్ తెలిపారు. యూఏఈకి వస్తున్న చైనా ప్రవాసులు మరియు వ్యాపారాల భారీ ప్రవాహం కూడా ఉందని బోకియాన్ తెలిపారు. ఇప్పుడు దుబాయ్లో 370,000 కంటే ఎక్కువ మంది చైనీయులు నివసిస్తున్నారని, 8,000 వ్యాపారాలు ఎమిరేట్లో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఆసియాను యూరప్ మరియు ఆఫ్రికాకు కలిపే వాణిజ్యం మరియు మౌలిక సదుపాయాల నెట్వర్క్ను స్థాపించే లక్ష్యంతో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని ఆమె తెలిపారు.
చైనాలో తయారైన ఫ్లయింగ్ ట్యాక్సీలు వార్తల్లో హల్ చల్ చేశాయి. 2022లో చైనీస్-నిర్మిత XPeng X2 Gitex గ్లోబల్ టెక్నాలజీ షో సందర్భంగా రెండు సీట్ల ఫ్లయింగ్ కారు మొదటి పబ్లిక్ టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి మరియు ఎనిమిది ప్రొపెల్లర్లను ఉపయోగించి భూమి నుండి నిలువుగా పైకి లేపడం ద్వారా గంటకు 130కిమీ వేగంతో చేరుకోవడానికి రూపొందించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







