యూఏఈకి చైనా ఎగిరే కార్లు
- April 12, 2024
యూఏఈ: ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ముఖ్యంగా చైనాలో తయారైన ఎగిరే కార్లు త్వరలో యూఏఈ కి వస్తాయని భావిస్తున్నారు. కొత్తగా నియమించబడిన చైనీస్ కాన్సుల్ జనరల్ బోకియాన్ తెలిపారు. యూఏఈకి వస్తున్న చైనా ప్రవాసులు మరియు వ్యాపారాల భారీ ప్రవాహం కూడా ఉందని బోకియాన్ తెలిపారు. ఇప్పుడు దుబాయ్లో 370,000 కంటే ఎక్కువ మంది చైనీయులు నివసిస్తున్నారని, 8,000 వ్యాపారాలు ఎమిరేట్లో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఆసియాను యూరప్ మరియు ఆఫ్రికాకు కలిపే వాణిజ్యం మరియు మౌలిక సదుపాయాల నెట్వర్క్ను స్థాపించే లక్ష్యంతో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)లో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని ఆమె తెలిపారు.
చైనాలో తయారైన ఫ్లయింగ్ ట్యాక్సీలు వార్తల్లో హల్ చల్ చేశాయి. 2022లో చైనీస్-నిర్మిత XPeng X2 Gitex గ్లోబల్ టెక్నాలజీ షో సందర్భంగా రెండు సీట్ల ఫ్లయింగ్ కారు మొదటి పబ్లిక్ టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి మరియు ఎనిమిది ప్రొపెల్లర్లను ఉపయోగించి భూమి నుండి నిలువుగా పైకి లేపడం ద్వారా గంటకు 130కిమీ వేగంతో చేరుకోవడానికి రూపొందించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







