వీల్చైర్లో ఉన్న మహిళను సత్కరించిన యూఏఈ ప్రెసిడెంట్
- April 21, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అబుదాబిలోని కస్ర్ అల్ హోస్న్లో జరిగిన అబుదాబి అవార్డ్స్ 11వ ఎడిషన్ వేడుకలో పాల్గొన్నారు. ఎమిరేట్స్ అంతటా కమ్యూనిటీలకు అందించిన విశేష కృషికి ఎనిమిది మంది వ్యక్తులను సత్కరించారు. విద్య, సుస్థిరత, వైద్యం, మానవతా సహాయం, కమ్యూనిటీ అవగాహన మరియు దృఢ నిశ్చయంతో కూడిన వ్యక్తుల సాధికారత వంటి విభిన్న రంగాలలో విశేష సేవలు అందించిన వ్యక్తులను అవార్డులు అందజేసి సత్కరించారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవనీయులందరికీ తన అభినందనలు తెలియజేశారు.వారి స్ఫూర్తిదాయకమైన కృషిని కొనియాడారు.
యూఏఈ అధ్యక్షుడి నుంచి ప్రత్యేక అభినందనలు అందుకున్న ఇమెన్ స్ఫాక్సీ..2022లో అబుదాబి ఎమిరేట్లోని నివాస భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి తన ప్రథమ చికిత్స నైపుణ్యాన్ని ధైర్యంగా ఉపయోగించారు. 2005లో ఏర్పాటైన అబుదాబి అవార్డ్స్ వైద్య సంరక్షణ, విద్య, పర్యావరణ సుస్థిరత, యూఏఈ వారసత్వాన్ని పరిరక్షించడంతో సహా వివిధ రంగాలలో విలువైన కృషికి 17 విభిన్న దేశాల నుండి 100 మంది వ్యక్తులను గుర్తించి సత్కరించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







