ప్రైవేట్ స్కూళ్ల‌లో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు

- April 22, 2024 , by Maagulf
ప్రైవేట్ స్కూళ్ల‌లో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు

యూఏఈ: దుబాయ్, షార్జా  ఎమిరేట్‌లోని ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యా విధానాన్ని ఏప్రిల్ 22 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో  పాఠశాలలు ఆన్ లైన్ లెర్నింగ్ ను అమ‌లు చేస్తున్నాయి.  ఈమేర‌కు దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పున‌ర్ ప్రారంభించే ముందు స్కూల్స్ యాజ‌మాన్యాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.  రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దుబాయ్‌లోని అనేక పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రహదారులు, ఇళ్లు వ‌ర‌ద నీటిలోనే ఉన్నాయి. ప‌బ్లిక్ ర‌వాణా, మెట్రో సేవలపై ప్రభావం కొనసాగుతోంది.     

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com