ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- April 24, 2024హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని ఆయన అన్నారు.
అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్లకు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు. సాట్ చైర్మన్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనుంది.
ఉదయం 10 గంటలకు శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభిమానులతో పాటు యూత్ కాంగ్రెస్ భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు తరలిరావాలని శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?