తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- April 25, 2024
హైదరాబాద్: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు జిల్లాలకు వడగాలుల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. గరిష్టంగా సాధారణంగా కన్నా మూడు డిగ్రీలకు పైగా పెరిగాయని చెప్పారు. ఈనెల చివరి వారంలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









