తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- April 25, 2024
హైదరాబాద్: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు జిల్లాలకు వడగాలుల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. గరిష్టంగా సాధారణంగా కన్నా మూడు డిగ్రీలకు పైగా పెరిగాయని చెప్పారు. ఈనెల చివరి వారంలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







