నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- April 25, 2024
న్యూ ఢిల్లీ: నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ లోని పలు లోక్సభ స్థానాలకు నాలుగో విడతలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మే 13నే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
- 7 రోజుల పాటు నామినేషన్ల పర్వం
- ఈనెల 18 నుంచి ఈరోజు వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం
- మొత్తం 7 పనిదినాల పాటు నామినేషన్లు
- 26న నామినేషన్ల పరిశీలన
- ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ
- 29 సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల
- వచ్చే నెల మే 13న ఎన్నికల పోలింగ్..
- జూన్ 4న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో నామినేషన్ల వివరాలు..
- నిన్నటి వరకు తెలంగాణలో 547 మంది నామినేషన్లు
- నిన్నటివరకు 856 సెట్ల నామినేషన్లు దాఖలు
- నిన్నటి వరకు అత్యధికంగా మల్కాజిగిరి లో 53 మంది నామినేషన్
- మల్కాజిగిరి తరువాత భువనగిరి లో 45 మంది నామినేషన్
- నిన్నటి వరకు చేవెళ్లలో 44 మంది నామినేషన్
- నిన్నటి వరకు అత్యల్పంగా అదిలాబాద్ లో 12 మంది నామినేషన్
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









