యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- April 28, 2024
యూఏఈ: శాంతి, ప్రేమ మరియు సామరస్య సందేశాన్ని ప్రచారం చేయాలని కోరుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) పారిష్ అబుదాబిలో తన మొదటి చర్చిని ఆదివారం ప్రారంభించనుంది. ఈ మేరకు వివరాలను కేరళ డియోసెస్ బిషప్ రెవ. డాక్టర్ మలయిల్ సాబు కోశి చెరియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. "వివిధ మతాలు మరియు విశ్వాసాలను ఆచరించడంలో మరియు ప్రార్థనా స్థలాల నిర్మాణానికి భూమి ఇవ్వడంలో ఇక్కడి ప్రవాస సమాజానికి స్వేచ్ఛను అందించినందుకు యూఏఈ పాలకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’ అని బిషప్ చెరియన్ తెలిపారు.
అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా అందజేసిన అబు మురీఖాలోని 4.37 ఎకరాల స్థలంలో చర్చిని నిర్మించారు. సరిగ్గా కొత్త చర్చి ఫిబ్రవరి 14న ప్రారంభించబడిన BAPS హిందూ దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చర్చి కాంప్లెక్స్లో 880 కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







