యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- April 28, 2024
యూఏఈ: శాంతి, ప్రేమ మరియు సామరస్య సందేశాన్ని ప్రచారం చేయాలని కోరుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) పారిష్ అబుదాబిలో తన మొదటి చర్చిని ఆదివారం ప్రారంభించనుంది. ఈ మేరకు వివరాలను కేరళ డియోసెస్ బిషప్ రెవ. డాక్టర్ మలయిల్ సాబు కోశి చెరియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. "వివిధ మతాలు మరియు విశ్వాసాలను ఆచరించడంలో మరియు ప్రార్థనా స్థలాల నిర్మాణానికి భూమి ఇవ్వడంలో ఇక్కడి ప్రవాస సమాజానికి స్వేచ్ఛను అందించినందుకు యూఏఈ పాలకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’ అని బిషప్ చెరియన్ తెలిపారు.
అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా అందజేసిన అబు మురీఖాలోని 4.37 ఎకరాల స్థలంలో చర్చిని నిర్మించారు. సరిగ్గా కొత్త చర్చి ఫిబ్రవరి 14న ప్రారంభించబడిన BAPS హిందూ దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చర్చి కాంప్లెక్స్లో 880 కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయవచ్చు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









