ఐఎస్, ఎల్ఈటీ కుట్రలు....
- June 08, 2016భీకర ఉగ్రదాడులతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ కన్ను భారత్ పై ఇదివరకే ఉంది. మన ఇంటెలిజెన్స్ బృందాలు ఎక్కడికక్కడ ఐఎస్ ను నిర్వీర్యం చేయడంతో తోకముడిచింది. అయితే ఇప్పుడు మరో గుంటనక్క సాయంతో ఐఎస్ భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు జారీచేసిన హెచ్చరికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.సిరియా, ఇరాక్ లలో ప్రాబల్యం ఉన్న ఐఎస్.. వివిధ దేశాల్లోని స్థానిక ఉగ్రమూకలతో సంబంధాలు పెట్టుకునే దిశగా ఎప్పటినుంచో పథకాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన లష్కరే తాయిబా సంస్థతో టైఅప్ అయింది. 1990ల నుంచి భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే సాయంతో మరిన్ని దాడులు జరపాలని ఐఎస్ భావిస్తున్నట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి.ఐఎస్ పథకం రూపొందస్తే, లష్కరే దానిని అమలు చేస్తుందని, వారికి ఆ అవకాశం కల్పించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఐబీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం