నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- May 05, 2024యూఏఈ: వచ్చే భారత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కు గల్ప్ కార్మికులు మద్దతు తెలిపారు. అబుదాబి సమావేశమైన గల్ప్ కార్మికులు.. ఈ మేరకు మద్దతు ప్రకటించారు. అదే విధంగా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలని గల్ఫ్ లో ఉన్న కార్మికులు ఆకాక్షించారు. ఈ మేరకు గల్ప్ కార్మికుల సంఘం నాయకులు పెనుకుల అశోక్ తెలిపారు. కొందరు కావాలని గల్ఫ్ కార్మికులను వాడుకొని వారి రాజకీయ లబ్ధి కోసమే బిజెపి పార్టీని. ఎంపీ అరవింద్ గారిని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అరవింద్ కేంద్ర మంత్రి కూడా అవుతారని ఆశభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఎంపీ అరవింద్ ఎంతోమంది గల్ఫ్ కార్మికులను అక్కున చేర్చుకొని, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారని తెలిపారు. అరవింద్ ను విమర్శించే స్థాయి నంగి దేవేందర్ రెడ్డి ది కాదన్నారు.మీరు చేసిన సేవలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు గంగాధర్, సంగేశ్వర్ ,బియా, రామ్ చరణ్, అజయ్, కొమరం, నర్సయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?