ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- May 08, 2024న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేశారు. దీంట్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంత మంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకున్నారని, గత రాత్రి నుంచి విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఎందుకు ఉద్యోగులు ఒకేసారి సిక్ లీవ్లో వెళ్లారో తెలియడం లేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతినిధి వెల్లడించారు. విమానల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డవారికి రిఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. లేదంటే జర్నీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుందని ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు