బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- May 11, 2024
ముంబై: అక్షయ తృతీయ సీజన్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ అందింది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం లేదా ఏదైనా పండగ ఉన్నా మహిళలు కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతుండటంతో కొనుగోలు దారులు అయోమయంలో పడిపోయారు. మూడు నెలలపాటు పెండ్లి ముహూర్తాలు లేనప్పటికీ బంగారం రేటు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి. అయితే అంతా మే 10న అక్షయ తృతీయ నాడు బంగారం రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ రేట్లు మరింత పెరగడంతో కొనడం మానేశారు. ఈ క్రమంలో.. మే 10న బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి రేట్లు తగ్గి కొనుగోలు దారులకు శుభవార్తను అందించాయి. అయితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గడంతో రూ. 67, 250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.330 తగ్గగా.. 73, 360కి విక్రయిస్తున్నారు. కిలో వెండిపై రూ. 1300 తగ్గడంతో రూ. 90, 500గా ఉంది. దీంతో.. పెళ్లిళ్లు పెట్టుకున్నవారు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







