'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- May 12, 2024
దుబాయ్: స్కూళ్లో నిద్రిస్తున్న మహిళా టీచర్ని అనధికారికంగా ఫోటో తీసి షేర్ చేసినందుకు గాను ఓ స్కూల్ ఉద్యోగికి దుబాయ్ కోర్టు 2,000 దిర్హామ్లు జరిమానా విధించింది. ఈ సంఘటన దుబాయ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విరామం సమయంలో ఫ్యాకల్టీ లాంజ్లో నిద్రిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న సహోద్యోగి టీచర్కు తెలియకుండా మొబైల్ ఫోన్ని ఉపయోగించి ఫోటో తీశాడు. అనంతరం ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా పాఠశాల యాజమాన్యానికి పంపించారు. ఉపాధ్యాయుడు తన గోప్యతకు భంగం కలిగించారని ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల గోప్యతను ఉల్లంఘించినందుకు పాఠశాల ఉద్యోగిని దోషిగా దుబాయ్ కోర్టు నిర్ధారించింది. 2,000 దిర్హామ్ల జరిమానా విధించింది. ఇతరుల గోప్యతను ఉల్లంఘించకుండా యూఏఈలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకరి గోప్యతకు భంగం కలిగించే ఫోటోగ్రాఫ్లు, వీడియోలు లేదా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు Dh500,000 వరకు భారీ జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









