'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- May 12, 2024
దుబాయ్: స్కూళ్లో నిద్రిస్తున్న మహిళా టీచర్ని అనధికారికంగా ఫోటో తీసి షేర్ చేసినందుకు గాను ఓ స్కూల్ ఉద్యోగికి దుబాయ్ కోర్టు 2,000 దిర్హామ్లు జరిమానా విధించింది. ఈ సంఘటన దుబాయ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విరామం సమయంలో ఫ్యాకల్టీ లాంజ్లో నిద్రిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న సహోద్యోగి టీచర్కు తెలియకుండా మొబైల్ ఫోన్ని ఉపయోగించి ఫోటో తీశాడు. అనంతరం ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా పాఠశాల యాజమాన్యానికి పంపించారు. ఉపాధ్యాయుడు తన గోప్యతకు భంగం కలిగించారని ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల గోప్యతను ఉల్లంఘించినందుకు పాఠశాల ఉద్యోగిని దోషిగా దుబాయ్ కోర్టు నిర్ధారించింది. 2,000 దిర్హామ్ల జరిమానా విధించింది. ఇతరుల గోప్యతను ఉల్లంఘించకుండా యూఏఈలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకరి గోప్యతకు భంగం కలిగించే ఫోటోగ్రాఫ్లు, వీడియోలు లేదా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు Dh500,000 వరకు భారీ జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







