ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- May 12, 2024
మస్కట్: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే ఇటీవల ఒమన్ను సందర్శించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన వీరు సాంఘిక సంక్షేమం మరియు సమాజ సేవకు అసాధారణ సేవలను అందించారు. విదర్భ ప్రాంతానికి చెందిన ఈ జంట సలాలా మరియు మస్కట్లకు సందర్శించారు. డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అతని భార్య, డాక్టర్ మందాకిని ఆమ్టేతో కలిసి 2008లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్లోని మాడియా గోండులకు లోక్ బిరాదారి ప్రకల్ప్ ద్వారా చేసిన సహకార ప్రయత్నాలకు ఈ గుర్తింపు లభించింది. ఒమన్లో పర్యటనలో ఆమ్టే దంపతులు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇండియన్ కమ్యూనిటీని ఆలోచింపజేసాయి. భారతీయ రాయబార కార్యాలయంలో భారత రాయబారి అమిత్ నారంగ్తో వారు సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









