ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- May 12, 2024
మస్కట్: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే ఇటీవల ఒమన్ను సందర్శించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన వీరు సాంఘిక సంక్షేమం మరియు సమాజ సేవకు అసాధారణ సేవలను అందించారు. విదర్భ ప్రాంతానికి చెందిన ఈ జంట సలాలా మరియు మస్కట్లకు సందర్శించారు. డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అతని భార్య, డాక్టర్ మందాకిని ఆమ్టేతో కలిసి 2008లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్లోని మాడియా గోండులకు లోక్ బిరాదారి ప్రకల్ప్ ద్వారా చేసిన సహకార ప్రయత్నాలకు ఈ గుర్తింపు లభించింది. ఒమన్లో పర్యటనలో ఆమ్టే దంపతులు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇండియన్ కమ్యూనిటీని ఆలోచింపజేసాయి. భారతీయ రాయబార కార్యాలయంలో భారత రాయబారి అమిత్ నారంగ్తో వారు సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







