చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను: మమ్ముట్టి
- May 29, 2024
త్రివేండ్రం: చివరి శ్వాస వరకూ తాను నటిస్తూనే ఉంటానన్నారు మమ్ముట్టి. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మరణించే చివరి క్షణం వరకు నటించినప్పటికీ తర్వాత ఎవరూ తనను గుర్తుపెట్టుకోరన్నారు.
'సినిమాలకు విరామం చెప్పే ఆలోచనలు నాకు లేవు. నేనేం అలసిపోలేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. అలా చేసినా నేను మరణించాక నన్నెంతకాలం గుర్తుపెట్టుకుంటారో చెప్పలేను. ఒక సంవత్సరం.. లేదంటే పదేళ్లు గుర్తుంచుకుంటారంతే. అది కూడా చాలా కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తుచేసుకుంటారు. ప్రపంచంలో ఉన్న వేలమంది నటుల్లో నేనూ ఒకడిని. ప్రేక్షకులు నన్ను ఏడాదికి మించి స్మరించుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రపంచం ఉన్నంతవరకు అందరూ నా గురించి మాట్లాడుకోవాలనే ఆశ నాకు లేదు' అని చెప్పారు. 1971లో ఇండస్ట్రీలోకి వచ్చిన మమ్ముట్టి ఇప్పటివరకు 420 చిత్రాలకు పైగా నటించారు. మూడుసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 'టర్బో'తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. వైశాక్ తెరకెక్కించిన మాస్ చిత్రమిది. ప్రస్తుతం మమ్ముట్టి రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!







