చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను: మమ్ముట్టి
- May 29, 2024
త్రివేండ్రం: చివరి శ్వాస వరకూ తాను నటిస్తూనే ఉంటానన్నారు మమ్ముట్టి. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మరణించే చివరి క్షణం వరకు నటించినప్పటికీ తర్వాత ఎవరూ తనను గుర్తుపెట్టుకోరన్నారు.
'సినిమాలకు విరామం చెప్పే ఆలోచనలు నాకు లేవు. నేనేం అలసిపోలేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. అలా చేసినా నేను మరణించాక నన్నెంతకాలం గుర్తుపెట్టుకుంటారో చెప్పలేను. ఒక సంవత్సరం.. లేదంటే పదేళ్లు గుర్తుంచుకుంటారంతే. అది కూడా చాలా కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తుచేసుకుంటారు. ప్రపంచంలో ఉన్న వేలమంది నటుల్లో నేనూ ఒకడిని. ప్రేక్షకులు నన్ను ఏడాదికి మించి స్మరించుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రపంచం ఉన్నంతవరకు అందరూ నా గురించి మాట్లాడుకోవాలనే ఆశ నాకు లేదు' అని చెప్పారు. 1971లో ఇండస్ట్రీలోకి వచ్చిన మమ్ముట్టి ఇప్పటివరకు 420 చిత్రాలకు పైగా నటించారు. మూడుసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 'టర్బో'తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. వైశాక్ తెరకెక్కించిన మాస్ చిత్రమిది. ప్రస్తుతం మమ్ముట్టి రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







