అలీ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి
- June 10, 2016
వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. మహిళలు, వృద్ధులే కాకుండా యువకులతో పాటు చిన్నారులు కూడా ఓపిగ్గా నిరీక్షించారు. 'అలీ వియ్ లవ్ యూ..' అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్లోని వాహనాలకు బటర్ఫ్లయ్ గుర్తులను ఉంచారు. 17 కార్లతో కూడిన భారీ కాన్వాయ్తో 19 మైళ్ల పాటు యాత్ర సాగింది.1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు.బాల్యంలో నివసించిన ఇల్లు, తొలిసారిగా బాక్సింగ్ లో ఓనమాలు నేర్చుకున్న జిమ్, మొహమ్మద్ అలీ సెంటర్, ఆఫ్రికన్ అమెరికన్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ దారిలో ఉన్నాయి. అలాగే అలీ శవపేటికను ఉంచిన వాహనం మీదికి అభిమానులు గులాబీ పూలను చల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు. దశాబ్దం క్రితమే తన చివరి క్రియల కోసం ఎంపిక చేసుకున్న కేవ్ హిల్ శ్మశానవాటికలోనే అలీ అంత్యక్రియలు జరిగాయి. ఇందులో ప్రస్తుత భార్యతో పాటు ఆయన ఇద్దరు మాజీ భార్యలు, పిల్లలు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, మాజీ హెవీవెయిట్ చాంపియన్లు లెనాక్స్ లూయిస్, మైక్ టైసన్ కూడా తమ ఆరాధ్య దైవానికి చివరిసారిగా వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







