కక్ష సాధించొద్దు.. ప్రతీకారాలొద్దు.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
- June 12, 2024
అమరావతి: ఏపీలో ప్రజలు అతిపెద్ద బాధ్యతను కూటమిపై పెట్టారని అన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ). ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది... అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ-జనసేన - బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమర్థించారు. ఈ సందర్భంగా పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చంద్రబాబు బాగా నలిగిపోవడం జైల్లో చూశానని, అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను కూడా చూశానని, మంచిరోజులు వస్తాయని, కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానని వెల్లడించారు. ఆ రోజులు వచ్చాయనీ.. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని, అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు యుక్తి, మోదీ స్ఫూర్తి, పవన్ శక్తి కలయికే కూటమి అని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







