తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు..
- June 13, 2024
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు.
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో తిరుపతి, తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. తిరుపతి వీధుల్లో ఎటు చూసినా పసుపు జెండాలే దర్శనం ఇచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుపతికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు నీరాజనం పట్టారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









