ఒమన్లో మండుతున్న ఎండలు..!
- June 19, 2024
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సునానా స్టేషన్ 47 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఒమన్ సుల్తానేట్లో గత రెండురోజుల్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది.అల్ బురైమి గవర్నరేట్లోని సునయనహ్ స్టేషన్లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 47.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆ తరువాత అల్ దహిరా గవర్నరేట్లోని హమ్రా అద్ దురు స్టేషన్ 46.5 డిగ్రీల సెల్సియస్తో ఆపై ధోఫర్ గవర్నరేట్లోని మక్షిన్ స్టేషన్ 46.2 డిగ్రీలతో నమోదైంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ స్టేషన్ మరియు మస్కట్ గవర్నరేట్లోని అమెరత్ స్టేషన్లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అల్ బురైమి స్టేషన్లో 46.0 డిగ్రీల సెల్సియస్, అల్ దహిరా గవర్నరేట్లోని ఇబ్రి స్టేషన్లో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







