ఒమన్లో మండుతున్న ఎండలు..!
- June 19, 2024
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సునానా స్టేషన్ 47 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఒమన్ సుల్తానేట్లో గత రెండురోజుల్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది.అల్ బురైమి గవర్నరేట్లోని సునయనహ్ స్టేషన్లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 47.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆ తరువాత అల్ దహిరా గవర్నరేట్లోని హమ్రా అద్ దురు స్టేషన్ 46.5 డిగ్రీల సెల్సియస్తో ఆపై ధోఫర్ గవర్నరేట్లోని మక్షిన్ స్టేషన్ 46.2 డిగ్రీలతో నమోదైంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ స్టేషన్ మరియు మస్కట్ గవర్నరేట్లోని అమెరత్ స్టేషన్లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అల్ బురైమి స్టేషన్లో 46.0 డిగ్రీల సెల్సియస్, అల్ దహిరా గవర్నరేట్లోని ఇబ్రి స్టేషన్లో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







