ఒమన్లో మండుతున్న ఎండలు..!
- June 19, 2024
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సునానా స్టేషన్ 47 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఒమన్ సుల్తానేట్లో గత రెండురోజుల్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది.అల్ బురైమి గవర్నరేట్లోని సునయనహ్ స్టేషన్లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 47.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆ తరువాత అల్ దహిరా గవర్నరేట్లోని హమ్రా అద్ దురు స్టేషన్ 46.5 డిగ్రీల సెల్సియస్తో ఆపై ధోఫర్ గవర్నరేట్లోని మక్షిన్ స్టేషన్ 46.2 డిగ్రీలతో నమోదైంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ స్టేషన్ మరియు మస్కట్ గవర్నరేట్లోని అమెరత్ స్టేషన్లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అల్ బురైమి స్టేషన్లో 46.0 డిగ్రీల సెల్సియస్, అల్ దహిరా గవర్నరేట్లోని ఇబ్రి స్టేషన్లో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ