అంతర్జాతీయ యోగా దినోత్సవం..!
- June 21, 2024
యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న జరుపుకుంటారు.ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యం. యోగా దినోత్సవం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి అపోహలను తొలగిస్తారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.
2015 జూన్ 21న యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. ఈ రోజున లక్షలాది మంది సామూహికంగా యోగా చేశారు. భారతదేశంలో ఈ ప్రధాన కార్యక్రమం ఢిల్లీ(delhi)లోని రాజ్పథ్లో నిర్వహించబడగా, ఇందులో సుమారు 35,000 మంది పాల్గొన్నారు. మనస్సు, శరీరం మధ్య ఐక్యతను స్థాపించే ప్రాచీన భారతీయ అభ్యాసం యోగా ప్రపంచ వేదికపై అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇది జరుపుకోవడం పదవ సంవత్సరం కావడం విశేషం.
యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనీ యోగా గురువులు చెబుతున్నారు.ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా యోగాను ప్రతీ ఒక్కరూ సాధన చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చునని చెప్పారు.
ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్(yoga theme)తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ దేశంలోని మహిళలకు అంకితం చేయబడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ “మహిళా సాధికారత కోసం యోగా”. ఈ థీమ్ మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యం.
న్యూ ఢిల్లీ లోని యోగా గురు వరుణ్ ఆచార్య కి సంబందించిన ఫోటోలు...
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)



తాజా వార్తలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!









