కువైట్ క్రౌన్ ప్రిన్స్‌ని కలిసిన భారత రాయబారి

- June 27, 2024 , by Maagulf
కువైట్ క్రౌన్ ప్రిన్స్‌ని కలిసిన భారత రాయబారి

కువైట్: హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-సబా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కువైట్‌లోని గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల చీఫ్‌లు మరియు ఆర్మీ, పోలీస్, నేషనల్ గార్డ్ సీనియర్ అధికారులను స్వీకరించారు. మంగళవారం బయాన్ ప్యాలెస్‌లోని అల్-సబా ఫ్యామిలీస్ దివాన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కూడా పాల్గొని యువరాజును కలిశారు. "కువైట్ రాజకుమారుడు షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను బయాన్ ప్యాలెస్‌లో కలవడం గౌరవంగా భావిస్తున్నాను. మూడో ప్రధానికి ఎంపికైన నరేంద్రమోదీకి క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసారు." అని సమావేశం తర్వాత రాయబారి ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com