ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు..
- June 27, 2024
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆరు నెలల పాటు అంటే.. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించింది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్ గా కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేసి నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరభ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి మరో పది రోజులు మాత్రమే పదవీకాలం మిగిలి ఉంది. అంటే.. ఈనెల 30న ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో నీరభ్ సర్వీసును పొడిగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆరు నెలలు నీరభ్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







