ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు..
- June 27, 2024
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆరు నెలల పాటు అంటే.. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించింది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్ గా కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేసి నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరభ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి మరో పది రోజులు మాత్రమే పదవీకాలం మిగిలి ఉంది. అంటే.. ఈనెల 30న ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో నీరభ్ సర్వీసును పొడిగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆరు నెలలు నీరభ్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







