కువైట్ లో ముగియనున్న క్షమాభిక్ష పథకం..కీలక సమీక్ష
- June 28, 2024
కువైట్: జూన్ 30తో క్షమాభిక్ష పథకం ముగియనున్నందున రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిపై భద్రతా ప్రచారాల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు వివిధ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక దళాల వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అధ్యక్షత వహించారు.
అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి 17 నుండి జూన్ 17 వరకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించింది, అనంతరం జూన్ 30 వరకు దానిని పొడిగించబడింది. రెసిడెన్సీ చట్టం ఉల్లంఘించినవారు ఎటువంటి పెనాల్టీ లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి మరియు కొత్త వీసాపై తిరిగి రావడానికి లేదా వారి ఉల్లంఘనలను పరిష్కరించుకోవడానికి అనుమతించారు. క్షమాభిక్ష కాలంలో దేశం విడిచి వెళ్లని లేదా వారి బసను చట్టబద్ధం చేయని, ఉల్లంఘించిన వారిపై అన్ని గవర్నరేట్లలో భద్రతా ప్రచారాలను ఎలా నిర్వహించాలనే దానిపై ఈ సమావేశం సమీక్షించింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









