నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- July 05, 2024
మనామా: 22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాద ఘటన తర్వాత వృద్ధ దంపతులపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై వారు కొప్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 57 మరియు 62 సంవత్సరాల వయస్సు గల దంపతులు తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత కారును నడుపుతున్న నిందితుడు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడపడం చూసిన జంట సదరు డ్రైవర్ ను హెచ్చరించడానికి హారన్ కొట్టారు. ట్రాఫిక్ లైట్ వద్దకు రాగానే ఇద్దరు తమ వాహనాలను ఆపారు. ఈ సమయంలో నిందితుడు కారు దిగి, దంపతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. ముగ్గురు వ్యక్తులు కారు నుండి దిగి ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. 57 ఏళ్ల వ్యక్తిని తన్నడంతో అతను పడిపోయాడు. అతని ఎడమ కాలు విరిగింది. ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు దాడిని అంగీకరించాడు. 57 ఏళ్ల బాధితుడు 12% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడని వైద్య నివేదిక ధృవీకరించింది. 62 ఏళ్ల బాధితుడు కూడా ఈ సంఘటనలో గాయపడినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. జూలై 8న తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









