దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు
- July 06, 2024
దుబాయ్: జూలై 6 నుండి 17 వరకు వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) విమానాశ్రయం.. ప్రయాణికులు కాని వారి కోసం కొన్ని పరిమితులను ప్రకటించారు. యూఏఈలోని పాఠశాలలు జూలై, ఆగస్టులలో వేసవి సెలవులు ఉంటాయి. పీక్ పీరియడ్లలో టెర్మినల్స్లో ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులను ఎయిర్పోర్టుకు దించే వారు తమ వీడ్కోలు ఇంట్లోనే చెప్పాలని అధికారులు సూచించారు. టెర్మినల్స్ 1 మరియు 3 రెండింటిలోనూ అరైవల్ ఫోర్కోర్టులకు యాక్సెస్ ప్రజా రవాణా మరియు అధీకృత విమానాశ్రయ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.
DXB జూలై 6 నుండి 17 వరకు ట్రాఫిక్లో "గణనీయ పెరుగుదల" చూస్తుంది. మొత్తం 3.3 మిలియన్ల మంది అతిథులు దాని టెర్మినల్స్ ద్వారా వచ్చివెళతారు. ఈ కాలంలో, 914,000 మంది ప్రయాణికులు DXB నుండి బయటికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూలై 12-14 వారాంతంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, DXB 840,000 మంది ప్రయాణీకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని, ఇది అత్యంత రద్దీగా ఉండే వారాంతం అవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







