దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు
- July 06, 2024
దుబాయ్: జూలై 6 నుండి 17 వరకు వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) విమానాశ్రయం.. ప్రయాణికులు కాని వారి కోసం కొన్ని పరిమితులను ప్రకటించారు. యూఏఈలోని పాఠశాలలు జూలై, ఆగస్టులలో వేసవి సెలవులు ఉంటాయి. పీక్ పీరియడ్లలో టెర్మినల్స్లో ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులను ఎయిర్పోర్టుకు దించే వారు తమ వీడ్కోలు ఇంట్లోనే చెప్పాలని అధికారులు సూచించారు. టెర్మినల్స్ 1 మరియు 3 రెండింటిలోనూ అరైవల్ ఫోర్కోర్టులకు యాక్సెస్ ప్రజా రవాణా మరియు అధీకృత విమానాశ్రయ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.
DXB జూలై 6 నుండి 17 వరకు ట్రాఫిక్లో "గణనీయ పెరుగుదల" చూస్తుంది. మొత్తం 3.3 మిలియన్ల మంది అతిథులు దాని టెర్మినల్స్ ద్వారా వచ్చివెళతారు. ఈ కాలంలో, 914,000 మంది ప్రయాణికులు DXB నుండి బయటికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూలై 12-14 వారాంతంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, DXB 840,000 మంది ప్రయాణీకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని, ఇది అత్యంత రద్దీగా ఉండే వారాంతం అవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









