దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు
- July 06, 2024
దుబాయ్: జూలై 6 నుండి 17 వరకు వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) విమానాశ్రయం.. ప్రయాణికులు కాని వారి కోసం కొన్ని పరిమితులను ప్రకటించారు. యూఏఈలోని పాఠశాలలు జూలై, ఆగస్టులలో వేసవి సెలవులు ఉంటాయి. పీక్ పీరియడ్లలో టెర్మినల్స్లో ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులను ఎయిర్పోర్టుకు దించే వారు తమ వీడ్కోలు ఇంట్లోనే చెప్పాలని అధికారులు సూచించారు. టెర్మినల్స్ 1 మరియు 3 రెండింటిలోనూ అరైవల్ ఫోర్కోర్టులకు యాక్సెస్ ప్రజా రవాణా మరియు అధీకృత విమానాశ్రయ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.
DXB జూలై 6 నుండి 17 వరకు ట్రాఫిక్లో "గణనీయ పెరుగుదల" చూస్తుంది. మొత్తం 3.3 మిలియన్ల మంది అతిథులు దాని టెర్మినల్స్ ద్వారా వచ్చివెళతారు. ఈ కాలంలో, 914,000 మంది ప్రయాణికులు DXB నుండి బయటికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూలై 12-14 వారాంతంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, DXB 840,000 మంది ప్రయాణీకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని, ఇది అత్యంత రద్దీగా ఉండే వారాంతం అవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







