షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ..
- July 26, 2024
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రమత్తులో ఉండగా లగేజీ దోచుకొని వెళ్లిపోయారు. మహారాష్ట్ర లాతూరు రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణీకుల లకేజీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ ఎత్తున బంగారంతోపాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అర్ధరాత్రి 2గంటల సమయంలో ఈ దోపీడి జరిగింది. దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్ కు ముందున్న వర్లీ స్టేషన్ లో దిగిపోయినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్ లో రైలును నిలిపివేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తరువాత పలువురు ప్రయాణికులు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పీఎస్ లో మరికొందరు ప్రయాణీకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







