షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ..
- July 26, 2024
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రమత్తులో ఉండగా లగేజీ దోచుకొని వెళ్లిపోయారు. మహారాష్ట్ర లాతూరు రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణీకుల లకేజీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ ఎత్తున బంగారంతోపాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అర్ధరాత్రి 2గంటల సమయంలో ఈ దోపీడి జరిగింది. దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్ కు ముందున్న వర్లీ స్టేషన్ లో దిగిపోయినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్ లో రైలును నిలిపివేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తరువాత పలువురు ప్రయాణికులు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పీఎస్ లో మరికొందరు ప్రయాణీకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









