పసిడి ధర కాస్త తగ్గింది

- June 15, 2016 , by Maagulf
పసిడి ధర కాస్త తగ్గింది

వరసగా ఆరు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర బుధవారం కాస్త తగ్గింది. రూ.130 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండు తగ్గడం, కీలక సమయాల్లో వారి నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,284.20యూఎస్‌ డాలర్లకు చేరింది.
అయితే బుధవారం వెండి ధర మాత్రం పెరిగింది. రూ.90 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,350కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com