యూఏఈ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం
- June 15, 2016
యూఏఈ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం నేటి నుంచి (జూన్ 15) అమల్లోకి వచ్చింది. చిన్న పిల్లల్ని దూషించడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇంట్లో ఒంటరిగా వదిలెయ్యడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షింపబడతారు కొత్త చట్టం ప్రకారం. అలాగే చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కూడా నేరం. లైంగిక ఆరోపణలు, పిల్లల్ని వేధింపులకు గురిచేసిన కేసులు నమోదైతే, విధుల నుంచి తక్షణం తొలగించేలా ఈ చట్టంలో నిబంధనల్ని పేర్కొన్నారు. తల్లిదండ్రులైనా సే పిల్లల్ని మొహంపై కొట్టడం నేరం. దెబ్బలు కొట్టిన ఆనవాళ్ళు వుంటే తల్లిదండ్రులూ శిక్షింపబడతారు. ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదిలితే శిక్ష తప్పదు. కారులో ముందు సీటులో పిల్లల్ని కూర్చోబెట్టడం నేరం. కోపంతో బిగ్గరగా అరవడం కూడా నేరమే. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూడు వార్నింగ్స్ ఇవ్వడంతోపాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు. ఆ పరిధి దాటితే మాత్రం చట్ట ప్రకారం శిక్ష తప్పదు. చైల్డ్ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్న ఈచర్యలు సత్ఫలితాలనిస్తాయని అధికారులు వెల్లడించారు. పసి పిల్లలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయనీ, అలాంటివాటికి ఈ చట్టం చెక్ పెడుతుందని వారు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







