అతి ఖరీదైన టైర్లు దుబాయ్ సొంతం
- June 15, 2016
కారు కన్నా కారు టైర్లు ఖరీదైనవైతే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలానే ఉంటుంది. ఈ టైర్లు కారుకి అమర్చితే, అది బెంజ్ కారు కావొచ్చు, ఇంకా ఖరీదైన కారు కావొచ్చు. కారు చిన్నబోవాల్సిందే. ఎందుకంటే ఈ టైర్లు అంత ఖరీదైనవి. 2.2 మిలియన్ దిర్హామ్ల విలువైన కారు టైర్లను తయారు చేయించింది దుబాయ్కి చెందిన ఓ సంస్థ. జెడ్ టైర్స్ వీటిని తయారు చేసింది. 24 క్యారెట్ గోల్డ్ మరియు డైమండ్ స్టోన్స్తో వీటిని తయారు చేసినట్లు సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. డిజైన్ని దుబాయ్లో చేయగా, ఇటలీలో ఆర్టిసన్ జ్యుయెలర్స్తో డెకరేట్ చేయించారు. అబుదాబీలో గోల్డ్ లీఫింగ్ చేశారు. నాలుగు టైర్లు 2 మిలియన్ దిర్హామ్లకు ఒక్కోటి చొప్పున విక్రయించారు. ప్రపంచంలోనే అతి ఖరీదైన టైర్లుగా ఈ టైర్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించనున్నాయి. జెడ్ టైర్స్ సిఇఓ హర్జీవ్ కందారి మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఈ టైర్లను రూపొందించడం ప్రతిష్టాత్మకంగా భావించామని తెలిపారు. దీని ద్వారా వచ్చే లాభాల్ని రమదాన్ సందర్భంగా జెనెసిస్ ఫౌండేషన్కి డొనేట్ చేయనున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







