ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే: మంత్రి పొన్నం ప్రభాకర్
- July 30, 2024
హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ… విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలోనే నవోదయ పాఠశాలలు, గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. వాటిల్లో చదివిన వారు చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. జీవచ్ఛవంలా ఉన్న ఆర్టీసీని తాము ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఆర్టీసీ చక్రం నడవదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సంస్థపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే అన్నారు. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









