8,200 మీటర్ల ఎత్తున మృతదేహం.. దుబాయ్ పర్వతారోహకుడు సహాయం
- August 01, 2024
యూఏఈ: దుబాయ్కు చెందిన పర్వతారోహకురాలు నైలా కియాని ఎనిమిది మంది పర్వతారోహకుల బృందానికి నాయకత్వం వహించి.. 8,200 మీటర్ల ఎత్తులో ఉన్న K2 శిఖరం నుండి ముహమ్మద్ హసన్ షిగ్రీ మృతదేహాన్ని తీసుకురావడానికి సహాయంగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఇది ప్రపంచంలోని రెండవ-ఎత్తైన పర్వతంపై ఇప్పటివరకు చేసిన అత్యధిక రికవరీగా నిలిచింది. మృతదేహాన్ని బేస్ క్యాంప్ వరకు తీసుకురావడానికి మూడు రోజులు పడింది. గత ఏడాది హసన్ వాతావరణ పరిస్థితుల కారణంగా చిక్కుకుని మరణించారు. అతడితోపాటు ఉన్న బృందం అతడిని వదిలేసి తిరిగి వచ్చేసింది.
యూఏఈ మష్రెక్ బ్యాంక్ మద్దతుతో మానవతా ప్రాతిపదికన ప్రారంభించబడిన K2 క్లీన్-అప్ ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పుడు సహాయం కోసం హసన్ కుటుంబం తనను సంప్రదించిందని కియాని చెప్పారు. ఇతర ఏడుగురు సభ్యులలో ఐదుగురు అధిరోహకులలో దిలావర్ సద్పరా, అక్బర్ హుస్సేన్ సద్పరా, జాకీర్ హుస్సేన్ సద్పరా, మహ్మద్ మురాద్ సద్పరా, అలీ మహమ్మద్ సద్పరా, లాజిస్టిక్స్ మేనేజర్ ఇమ్రాన్ అలీ, వలీ ఉల్లా ఫల్లాహి ఉన్నారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









