8,200 మీటర్ల ఎత్తున మృతదేహం.. దుబాయ్ పర్వతారోహకుడు సహాయం
- August 01, 2024
యూఏఈ: దుబాయ్కు చెందిన పర్వతారోహకురాలు నైలా కియాని ఎనిమిది మంది పర్వతారోహకుల బృందానికి నాయకత్వం వహించి.. 8,200 మీటర్ల ఎత్తులో ఉన్న K2 శిఖరం నుండి ముహమ్మద్ హసన్ షిగ్రీ మృతదేహాన్ని తీసుకురావడానికి సహాయంగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఇది ప్రపంచంలోని రెండవ-ఎత్తైన పర్వతంపై ఇప్పటివరకు చేసిన అత్యధిక రికవరీగా నిలిచింది. మృతదేహాన్ని బేస్ క్యాంప్ వరకు తీసుకురావడానికి మూడు రోజులు పడింది. గత ఏడాది హసన్ వాతావరణ పరిస్థితుల కారణంగా చిక్కుకుని మరణించారు. అతడితోపాటు ఉన్న బృందం అతడిని వదిలేసి తిరిగి వచ్చేసింది.
యూఏఈ మష్రెక్ బ్యాంక్ మద్దతుతో మానవతా ప్రాతిపదికన ప్రారంభించబడిన K2 క్లీన్-అప్ ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పుడు సహాయం కోసం హసన్ కుటుంబం తనను సంప్రదించిందని కియాని చెప్పారు. ఇతర ఏడుగురు సభ్యులలో ఐదుగురు అధిరోహకులలో దిలావర్ సద్పరా, అక్బర్ హుస్సేన్ సద్పరా, జాకీర్ హుస్సేన్ సద్పరా, మహ్మద్ మురాద్ సద్పరా, అలీ మహమ్మద్ సద్పరా, లాజిస్టిక్స్ మేనేజర్ ఇమ్రాన్ అలీ, వలీ ఉల్లా ఫల్లాహి ఉన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







