పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు..
- August 01, 2024
అమరావతి: సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు. గుండుమల గ్రామంలో ఇంటింటికి వెళ్లి మరీ స్వయంగా లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా లబ్దిదారుల కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు.
మరోవైపు పెన్షన్ లబ్దిదారులు ఓబులమ్మకు ఇల్లు కట్టిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ను ఆదేశించారు. మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు.. ఓబులమ్మకు వితంతు పెన్షన్ అంజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమారులు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపింది. తన ఇల్లు సరిగా లేకపోవడంతో వారు ఇంటికి కూడా రావడం లేదని వాపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. కలెక్టర్ ని పిలిచి ఓబులమ్మ ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. వారికి తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు.అంతేకాదు వారితో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారి యోగ క్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







