పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు..
- August 01, 2024
అమరావతి: సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు. గుండుమల గ్రామంలో ఇంటింటికి వెళ్లి మరీ స్వయంగా లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా లబ్దిదారుల కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు.
మరోవైపు పెన్షన్ లబ్దిదారులు ఓబులమ్మకు ఇల్లు కట్టిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ను ఆదేశించారు. మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు.. ఓబులమ్మకు వితంతు పెన్షన్ అంజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమారులు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపింది. తన ఇల్లు సరిగా లేకపోవడంతో వారు ఇంటికి కూడా రావడం లేదని వాపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. కలెక్టర్ ని పిలిచి ఓబులమ్మ ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. వారికి తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు.అంతేకాదు వారితో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారి యోగ క్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







