బ్రెజిల్: కుప్పకూలిన విమానం..62 మంది దుర్మరణం
- August 10, 2024
బ్రెజిల్: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు.
సావో పువాలో లోని విన్ హెడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుకుంది.నివాస ప్రాంతంలో…విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
అయితే విమానం నివాసిత ప్రాంతంలో పడిన స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అక్కడ ఒక నివాస ప్రాంతం మాత్రం దెబ్బతినిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









