బ్రెజిల్: కుప్పకూలిన విమానం..62 మంది దుర్మరణం
- August 10, 2024
బ్రెజిల్: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు.
సావో పువాలో లోని విన్ హెడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుకుంది.నివాస ప్రాంతంలో…విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
అయితే విమానం నివాసిత ప్రాంతంలో పడిన స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అక్కడ ఒక నివాస ప్రాంతం మాత్రం దెబ్బతినిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







