తిరుమల ఘాట్ రోడ్లో మళ్లీ ఆంక్షలు..
- August 12, 2024
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపడంతో ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్ 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులకు వాహనదారులు సమాచారం అందించారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు కలకలం రేపాయి. పలువురు భక్తులపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుమల ఘాట్ రోడ్లలో బైక్ ల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్ పై వెళ్తున్న కొందరికి చిరుత పులి కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆ వెంటనే భక్తులను అప్రమత్తం చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







