మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..!
- August 12, 2024
అమరావతి: కొత్త మద్యం పాలసీపై ఏపీ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోంది. మద్యం కొనుగోళ్ల పాలసీపై వివిధ మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు రూ.100 లోపే ఉండేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోనుంది.
తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసింది గత ప్రభుత్వం. మినిమం(క్వార్టర్) ధర రూ.200గా ఫిక్స్ చేసింది జగన్ సర్కార్. తక్కువ ధర మద్యం అందుబాటులో లేకపోవడం, మద్యం ధరలు భారీగా పెరగడంతో మందుబాబులు, యువత గంజాయికి అలవాటు పడ్డారని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెప్పింది. కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నెల నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







