దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్..
- August 12, 2024
దక్షిణ కొరియా: అమెరికాలో పర్యటించిన పెట్టుబడులు ఆకర్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటుతోనే కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్, ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉందని తెలిపారు. మెగా టెస్ట్ సెంటర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
కాగా, సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో హ్యుందాయ్ మోటర్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. హ్యుందాయ్కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. హైదరాబాద్లోని ఇంజినీరింగ్ సెంటర్ను హ్యుందాయ్ ఆధునికీకరించనుంది. మెగా టెస్ట్ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!