BAPS హిందూ దేవాలయం ఆధ్వర్యంలో రక్షా బంధన్
- August 20, 2024
యూఏఈ: అబుదాబి BAPS హిందూ మందిర్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఇందులో బ్లూ కాలర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఆయా కంపెనీలు తమ సిబ్బందిని బస్సుల్లో ఆలయానికి తరలించారు. ప్రతి కార్మికుడికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ మరియు రక్షణకు ప్రతీకగా ఉండే ఒక పవిత్ర దారాన్ని స్వామీజీలు కట్టిఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీఏపీఎస్ హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ ఉత్సవాల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తమ కుటుంబాలు, ఆత్మీయులకు దూరంగా ఉంటున్న పలువురు కార్మికులు పండుగ రోజున ఆలయానికి వెళ్లే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాప్స్ ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా కొనసాగుతుందని బ్రహ్మవిహారి స్వామి తెలియజేశారు.




తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









