BAPS హిందూ దేవాలయం ఆధ్వర్యంలో రక్షా బంధన్
- August 20, 2024
యూఏఈ: అబుదాబి BAPS హిందూ మందిర్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఇందులో బ్లూ కాలర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఆయా కంపెనీలు తమ సిబ్బందిని బస్సుల్లో ఆలయానికి తరలించారు. ప్రతి కార్మికుడికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ మరియు రక్షణకు ప్రతీకగా ఉండే ఒక పవిత్ర దారాన్ని స్వామీజీలు కట్టిఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీఏపీఎస్ హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ ఉత్సవాల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తమ కుటుంబాలు, ఆత్మీయులకు దూరంగా ఉంటున్న పలువురు కార్మికులు పండుగ రోజున ఆలయానికి వెళ్లే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాప్స్ ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా కొనసాగుతుందని బ్రహ్మవిహారి స్వామి తెలియజేశారు.




తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









