BAPS హిందూ దేవాలయం ఆధ్వర్యంలో రక్షా బంధన్
- August 20, 2024
యూఏఈ: అబుదాబి BAPS హిందూ మందిర్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఇందులో బ్లూ కాలర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఆయా కంపెనీలు తమ సిబ్బందిని బస్సుల్లో ఆలయానికి తరలించారు. ప్రతి కార్మికుడికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ మరియు రక్షణకు ప్రతీకగా ఉండే ఒక పవిత్ర దారాన్ని స్వామీజీలు కట్టిఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీఏపీఎస్ హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ ఉత్సవాల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తమ కుటుంబాలు, ఆత్మీయులకు దూరంగా ఉంటున్న పలువురు కార్మికులు పండుగ రోజున ఆలయానికి వెళ్లే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాప్స్ ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా కొనసాగుతుందని బ్రహ్మవిహారి స్వామి తెలియజేశారు.




తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







