BAPS హిందూ దేవాలయం ఆధ్వర్యంలో రక్షా బంధన్
- August 20, 2024
యూఏఈ: అబుదాబి BAPS హిందూ మందిర్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఇందులో బ్లూ కాలర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఆయా కంపెనీలు తమ సిబ్బందిని బస్సుల్లో ఆలయానికి తరలించారు. ప్రతి కార్మికుడికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ మరియు రక్షణకు ప్రతీకగా ఉండే ఒక పవిత్ర దారాన్ని స్వామీజీలు కట్టిఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీఏపీఎస్ హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ ఉత్సవాల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తమ కుటుంబాలు, ఆత్మీయులకు దూరంగా ఉంటున్న పలువురు కార్మికులు పండుగ రోజున ఆలయానికి వెళ్లే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాప్స్ ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా కొనసాగుతుందని బ్రహ్మవిహారి స్వామి తెలియజేశారు.




తాజా వార్తలు
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్







