చికాగో భారతీయ అంధ క్రికెటర్ల పర్యటనకు NATS మద్దతు
- August 19, 2024
అమెరికా: అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్లను అనూహ్య మద్దతు లభిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)తో పాటు పలు తెలుగు, ఇతర భారతీయ స్వచ్చంధ సంస్థలు భారత అంధ క్రికెటర్లకు తమ హర్థిక, ఆర్ధిక మద్దతు అందిస్తున్నాయి. బెంగళూరు కి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్ధిక వనరులు చేకూర్చటం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా చికాగో లో నాట్స్తో పాటు నాట్స్ సోదర సంస్థలు భారత అంధ క్రికెటర్లను తమ మద్దతు ప్రకటించడంతో పాటు వారి కోసం విందు,పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటార్ ధీరజ్ అంధుల క్రికెట్లో మూడు కేటగిరిలను, వాటి విభజనను నాట్స్ సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టౌర్నమెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంధుల క్రికెట్ జట్టులో తెలుగు మరియు గుజరాతీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం పట్ల నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.
అంధత్వాన్ని అధిగమించి ఆటను జయించిన ఈ ఆటగాళ్ళని చూసి అందరం స్ఫూర్తి పొందాలని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. అంధ క్రికెటర్లకు నాట్స్ అండదండలు ఎల్లపుడూ ఉంటాయని, వారు ఆడే మ్యాచ్ లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటితో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కె బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల, ఇమ్మానుయేల్ నీల, చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్లపాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, చెన్నయ్య కంబాల, సిరి బచ్చు భారతి పుట్ట, గోపి ఉలవ, కిరణ్, ప్రదీప్, సతీష్ త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







