ఎయిర్ ట్రాఫిక్ లో ఇండిగో టాప్
- August 20, 2024
ముంబై: భారత విమానయాన సంస్థలకు చెందిన ఫ్లైట్లలో ఈ ఏడాది జులైలో కోటి 29 లక్షల మంది ప్యాసింజర్లు జర్నీ చేశారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.30% ఎక్కువ అని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూన్లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ దేశీయ ఎయిర్ ట్రాఫిక్లో ఆధిపత్యాన్ని కొనసాగించింది.జులైలో దాని మార్కెట్ వాటా 62 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. జులైలో ‘విస్తారా’కు సంబంధించిన దేశీయ మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకుంది. ఏఐఎక్స్ కనెక్ట్, స్పైస్జెట్ల వాటా 4.50 శాతం, 3.10 శాతం వరకు మాత్రమే ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ల వాటా 4.70, 0.90 శాతం నమోదైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







