ప్రపంచంలోనే సురక్షితమైన నగరం అబుధాబి
- August 25, 2024
అబుధాబి: ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రమాదాలు, నేరాలు, ఘోరాలకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. మెట్రో సిటీస్లోనూ భద్రతా పరమైన సమ్యలు తలెత్తుతున్నాయి.
దీంతో ప్రజలు, టూరిస్టులు నివసించడం, సందర్శించడం వంటి విషయాల్లో సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోకెల్లా సురక్షితమైన నగరమేది? అనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తంగా అవుతున్నాయి. నిపుణుల ప్రకారం ఆ వివరాలేంటో చూద్దాం.
అన్ని విధాలా సేఫ్గా ఉండే ప్రాంతం లేదా దేశానికి వెళ్లిరావాలని అనుకోవడం సహజమే. ముఖ్యంగా టూరిస్టులు ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కాగా భద్రతా రీత్యా సురక్షిత నగరం ఏదని చూసినప్పుడు వరల్డ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం.. అబుదాబి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ నగరాన్ని ప్రపంచంలో భద్రతా పరంగా 88.2, నేరాల పరంగా11.8 స్కోర్లతో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లైవ్ బిలిటీ ఇండెక్స్ ప్రజలందరూ సురక్షితంగా నివసించగలిగే, సందర్శించగలిగే సురక్షిత నగరంగా పేర్కొన్నది.
నేరాల పరంగా చూసినా అబుధాబిలో క్రైమ్ రేట్ చాలా తక్కువట. దీంతో ఇది వరల్డ్ ఫేమస్ అంట్ సేఫ్టీ టూరిస్ట్ దేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ సందర్శించదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ కూడా వేధింపులు, దొంగతనాలు, ప్రజలను తప్పుదోబ పట్టించడం వంటి నేరాలు, భద్రతాపరమైన సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.
ఇక టూరిస్టులు సందర్శించడానికి ఆసక్తి చూపే ప్రాంతాల విషయానికి వస్తే అబుధాబిలోని ఐలాండ్ -యాస్ ద్వీపం, ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ ల్యాండ్, ఆక్వా పార్క్, బ్రదర్ థీమ్స్, ఇండోర్ వార్నర్, యాస్ మాల్, మెరీనా ఫార్ములా వంటి ప్రదేశాల్లో ఎటువంటి భయం లేకుండా తిరగవచ్చు. అట్లనే లివా ఒసాయసిస్ అనే పురాతన సంప్రదాయ గ్రామం కూడా ఇక్కడ ఫేమస్. ఎక్కువగా ఎడారినే కనిపించే ఈ ప్రాంతంలో సఫారీ జీపులోనో, ఒంటెపైనో తిరిగి చూడవచ్చు. వెన్నెల రాత్రుల్లో ఈ ఏడారిలో ఎంజాయ్ చేసేందుకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. అయినా భద్రతా పరమైన సమస్యలు ఉండవు. వీటితోపాటు అబుధాబిలో ఇంకా అనేక పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకోవడమే కాకుండా సందర్శించడానికి సేఫ్గా ఉంటాయి. ఇక సురక్షితమైన నగరాల జాబితాలో అబుదాబి తర్వాత అజ్మాన్, దోహ, తైపీ, దుబాయ్ వరుసగా రెండు నుంచి ఐదవ స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







