భద్రతాదళాలపై విరుచుకుపడ్డ బొకోహరామ్ ఉగ్రవాదులు..
- June 18, 2016
బొకోహరామ్ ఉగ్రవాదులు మరోసారి భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈశాన్య నైగర్లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలొదిలారు. ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్, స్థానిక మిలిటరీ వర్గాలు ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. నైగర్లోని ఓ టౌన్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అదే సమయంలో బొకోహరామ్ ఉగ్రవాదులు మిలిటరీ బరాక్స్పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు ఆయుధాలు దోచుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పర్యటనలో ఉన్న మంత్రులెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇస్లామిస్ట్ చొరబాటుదారుల వల్ల ఇల్లూ వాకిలి వదులుకుని వలసబాట పట్టిన శరణార్థులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







