భద్రతాదళాలపై విరుచుకుపడ్డ బొకోహరామ్ ఉగ్రవాదులు..
- June 18, 2016
బొకోహరామ్ ఉగ్రవాదులు మరోసారి భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈశాన్య నైగర్లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలొదిలారు. ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్, స్థానిక మిలిటరీ వర్గాలు ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. నైగర్లోని ఓ టౌన్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అదే సమయంలో బొకోహరామ్ ఉగ్రవాదులు మిలిటరీ బరాక్స్పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు ఆయుధాలు దోచుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పర్యటనలో ఉన్న మంత్రులెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇస్లామిస్ట్ చొరబాటుదారుల వల్ల ఇల్లూ వాకిలి వదులుకుని వలసబాట పట్టిన శరణార్థులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









