ఆడిటింగ్..ఇండియా, బహ్రెయిన్ మధ్య కీలక ఒప్పందం..!
- August 29, 2024
మనామా: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ముందడుగు వేసింది. మనామాలోని నేషనల్ ఆడిట్ ఆఫీస్, బహ్రెయిన్ లో ఉన్న SAI బహ్రెయిన్తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఆడిట్ కార్యకలాపాల రంగాలలో సహకారం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, రెండు దేశాల సిబ్బంది సభ్యుల వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎమ్ఒయు ద్వారా శిక్షణా కార్యకలాపాలను ప్రోత్సహించడం, నిపుణుల సందర్శనలు, ఆడిటింగ్ రంగాలలో సాంకేతిక సమాచారం, పరిశోధన అవుట్పుట్ మార్పిడి కోసం ఒక వేదిక ఏర్పాటు చేయబడుతుందని CAG ఉన్నతాధికారి గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. మనామా పర్యటన సందర్భంగా CAG బృందం బహ్రెయిన్లోని ఒడియా సంఘంతో సమావేశమైంది. ప్రపంచ వేదికపై ఒడిషా గుర్తింపును పెంపొందించడంలో బహ్రెయిన్ ఒడియా సంఘం పాత్రను ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!