రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. సెప్టెంబరు 1 నుండి నిషేధం, జరిమానా రద్దు..
- August 29, 2024
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) సెప్టెంబర్ 1వ తేదీ నుండి రెండు నెలల పాటు రెసిడెన్సీ వీసాలను ఉల్లంఘించిన వారిపై నిషేధం, జరిమానాలను మాఫీ చేసే ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అబుదాబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ICP డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. ప్రవేశ, నివాస నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు మినహాయించే వాటిలో నివాస ఉల్లంఘనదారులు, వీసా ఉల్లంఘించినవారు, పనికి గైర్హాజరు అడ్మినిస్ట్రేటివ్ జాబితాలలో ఉన్నవారు, దేశంలో జన్మించిన విదేశీయుల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారు దేశం విడిచిపెట్టడానికి గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందాలని పిలుపునిచ్చారు. అనుమతి పొందినవారు 14 రోజులలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలా వెళ్లిన వారి పాస్పోర్ట్లపై నిషేధ ముద్ర వేయడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!