రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. సెప్టెంబరు 1 నుండి నిషేధం, జరిమానా రద్దు..
- August 29, 2024
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) సెప్టెంబర్ 1వ తేదీ నుండి రెండు నెలల పాటు రెసిడెన్సీ వీసాలను ఉల్లంఘించిన వారిపై నిషేధం, జరిమానాలను మాఫీ చేసే ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అబుదాబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ICP డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. ప్రవేశ, నివాస నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు మినహాయించే వాటిలో నివాస ఉల్లంఘనదారులు, వీసా ఉల్లంఘించినవారు, పనికి గైర్హాజరు అడ్మినిస్ట్రేటివ్ జాబితాలలో ఉన్నవారు, దేశంలో జన్మించిన విదేశీయుల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారు దేశం విడిచిపెట్టడానికి గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందాలని పిలుపునిచ్చారు. అనుమతి పొందినవారు 14 రోజులలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలా వెళ్లిన వారి పాస్పోర్ట్లపై నిషేధ ముద్ర వేయడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







