రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. సెప్టెంబరు 1 నుండి నిషేధం, జరిమానా రద్దు..
- August 29, 2024
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) సెప్టెంబర్ 1వ తేదీ నుండి రెండు నెలల పాటు రెసిడెన్సీ వీసాలను ఉల్లంఘించిన వారిపై నిషేధం, జరిమానాలను మాఫీ చేసే ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అబుదాబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ICP డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. ప్రవేశ, నివాస నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు మినహాయించే వాటిలో నివాస ఉల్లంఘనదారులు, వీసా ఉల్లంఘించినవారు, పనికి గైర్హాజరు అడ్మినిస్ట్రేటివ్ జాబితాలలో ఉన్నవారు, దేశంలో జన్మించిన విదేశీయుల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారు దేశం విడిచిపెట్టడానికి గ్రేస్ పీరియడ్ నుండి లబ్ది పొందాలని పిలుపునిచ్చారు. అనుమతి పొందినవారు 14 రోజులలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలా వెళ్లిన వారి పాస్పోర్ట్లపై నిషేధ ముద్ర వేయడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







