అంతర్జాతీయ యోగా వేడుకలకు ముస్తాబైన దుబాయ్
- June 18, 2016
ఇవాళ అనగా 18వ తారీకున దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ వారి ఆధ్వర్యం లో దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా బాబా రామ్ దేవ్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న (17-06-2016) న వాలంటీర్ లను నియమించారు వారిని రెండు గ్రూప్ లు గా విభజించారు. వాలంటీర్ లకు ప్రత్యేకమైన టీ-షర్టులు ఇచ్చారు. ఈ కార్యక్రమం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని 1 - 8 నెంబర్లు గల కన్వెన్షన్ హాల్స్ లో జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విధములైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా భారతీయులే కాక ముస్లిం సోదరులుకూడా ముందుకు రావడం అందరిని ఉత్తేజ పరిచింది. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా మన తెలుగు వారు అయిన జనగామ శ్రీనివాస్, ఆకుల పర్శరాములు, జనగామ బాలు, దొంతుల నరసయ్య, జనగామ బాలకిషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ గిరీష్ పంత్ (ప్రెసిడెంట్ దుబాయ్ చాప్టర్ - ఐపీఎఫ్ & సోషల్ వర్కర్) గారి పర్యవేక్షణలో జరుగనున్నది.



తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









