అంతర్జాతీయ యోగా వేడుకలకు ముస్తాబైన దుబాయ్

- June 18, 2016 , by Maagulf

ఇవాళ అనగా 18వ తారీకున దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ వారి ఆధ్వర్యం లో దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్  జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా బాబా రామ్ దేవ్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న (17-06-2016) న వాలంటీర్ లను నియమించారు వారిని రెండు గ్రూప్ లు గా విభజించారు. వాలంటీర్ లకు ప్రత్యేకమైన టీ-షర్టులు ఇచ్చారు. ఈ కార్యక్రమం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని 1 - 8 నెంబర్లు గల కన్వెన్షన్ హాల్స్ లో జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విధములైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా భారతీయులే కాక ముస్లిం సోదరులుకూడా ముందుకు రావడం అందరిని ఉత్తేజ పరిచింది. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా మన తెలుగు వారు అయిన జనగామ శ్రీనివాస్, ఆకుల పర్శరాములు, జనగామ బాలు, దొంతుల నరసయ్య, జనగామ బాలకిషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ గిరీష్ పంత్ (ప్రెసిడెంట్ దుబాయ్ చాప్టర్ - ఐపీఎఫ్ & సోషల్ వర్కర్) గారి పర్యవేక్షణలో జరుగనున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com