సెప్టెంబర్ 15నుండి లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్..!
- September 05, 2024
దుబాయ్: ఎమిరేట్ వ్యాప్తంగా ఆరవ దుబాయ్ లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈసారి క్రీడా విభాగాల సంఖ్యను 12కి పెంచినట్టు నిర్వాహకులు ప్రకటించారు.అలాగే టోర్నమెంట్లో శ్రామిక మహిళలకు బ్యాడ్మింటన్, యోగా, త్రాష్ బాల్ విభాగాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ప్రతి టోర్నమెంట్ విజేతలు తరువాత ఛాంపియన్స్ లీగ్లో పోటీపడతారన్నారు. 'మేకింగ్ దెమ్ హ్యాపీ ఈజ్ అవర్ గోల్ ' అనే థీమ్తో నిర్వహించే ఈ కార్యక్రమంలో 270 కంపెనీలకు చెందిన 46,000 మందికి కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దుబాయ్లోని పర్మనెంట్ కమిటీ ఆఫ్ లేబర్ అఫైర్స్, దుబాయ్ పోలీస్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్తో పాటు కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ సహకారంతో దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సమన్వయంతో ఈ ఈవెంట్ ఫిబ్రవరి 23, 2025 వరకు జరుగుతుంది. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్తో సహా క్రీడా ఈవెంట్లు దుబాయ్లోని వివిధ లేబర్ హౌసింగ్ సైట్లలో పది వేర్వేరు ప్రదేశాలలో జరుగుతాయని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సయీద్ హరేబ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









