సెప్టెంబర్ 15నుండి లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్..!
- September 05, 2024
దుబాయ్: ఎమిరేట్ వ్యాప్తంగా ఆరవ దుబాయ్ లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈసారి క్రీడా విభాగాల సంఖ్యను 12కి పెంచినట్టు నిర్వాహకులు ప్రకటించారు.అలాగే టోర్నమెంట్లో శ్రామిక మహిళలకు బ్యాడ్మింటన్, యోగా, త్రాష్ బాల్ విభాగాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ప్రతి టోర్నమెంట్ విజేతలు తరువాత ఛాంపియన్స్ లీగ్లో పోటీపడతారన్నారు. 'మేకింగ్ దెమ్ హ్యాపీ ఈజ్ అవర్ గోల్ ' అనే థీమ్తో నిర్వహించే ఈ కార్యక్రమంలో 270 కంపెనీలకు చెందిన 46,000 మందికి కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దుబాయ్లోని పర్మనెంట్ కమిటీ ఆఫ్ లేబర్ అఫైర్స్, దుబాయ్ పోలీస్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్తో పాటు కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ సహకారంతో దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సమన్వయంతో ఈ ఈవెంట్ ఫిబ్రవరి 23, 2025 వరకు జరుగుతుంది. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్తో సహా క్రీడా ఈవెంట్లు దుబాయ్లోని వివిధ లేబర్ హౌసింగ్ సైట్లలో పది వేర్వేరు ప్రదేశాలలో జరుగుతాయని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సయీద్ హరేబ్ తెలిపారు.
తాజా వార్తలు
- టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
- బైబ్యాక్ ఆప్షన్, సర్వీస్ ఛార్జీలు లేవు: దుబాయ్ డెవలపర్లు..!!
- రియాద్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళల అరెస్ట్..!!
- దుబాయ్ లూప్: ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి హై-స్పీడ్ భూగర్భ రవాణా వ్యవస్థ..!!
- ఫిబ్రవరి 21-22 తేదీలలో ఒమన్ మస్కట్ మారథాన్ 2025..!!
- ఎండోమెంట్ కంపెనీల స్థాపన, లైసెన్సింగ్పై అబుదాబిలో కొత్త నియమాలు..!!
- రమదాన్ ముందు తనిఖీలు.. షువైఖ్లోని తొమ్మిది దుకాణాలకు జరిమానా..!!
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన హోమ్ మంత్రి అనిత
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..